![]() |
![]() |
.webp)
ఆహా వేదికగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ లో.. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ కి ప్రభాస్ వచ్చాడు. నిన్న మొన్నటి దాకా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడటం..దాని వల్ల ఆహా యాప్ కొన్ని గంటల పాటు నిలిచిపోవడమనేది అందరికి తెలిసిన విషయమే. అయితే నిన్న మళ్ళీ మొదలైన ఈ స్పెషల్ ఎపిసోడ్.. ఆహాలో ఇప్పటివరకు జరిగిన వాటిలోఎక్కువ మంది వీక్షకులు చూసిన ఎపిసోడ్ గా నిలిచింది.
ఆ తర్వాత బాలకృష్ణ, ప్రభాస్ కి కొన్ని సినిమా డైలాగ్స్ వినిపించి అవి ఏ సినిమాలోనివో చెప్పమన్నాడు. ఆ తర్వాత ఆ సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. "రాజమౌళితో ఛత్రపతి నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి?" అని బాలకృష్ణ అడిగాడు. "సినిమా నాలుగు రోజులకే.. ఆయన మంచి మనిషి అని తెలిసింది. ఆ తర్వాత ప్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత ఏ షాట్ అయిన రెండు, మూడు టేక్సే.. ఛత్రపతి క్లైమాక్స్ షాట్ లో వర్షం, గుంపులుగా జనాలు ఉండేసరికి నాకు సిగ్గేసింది.ఇక నేను డైలాగ్ గట్టిగా చెప్పలేనని చెప్పాను. రాజమౌళి పిలిచి.. 'సరే ఎలా అయినా చెప్పు' అని అన్నాడు. ఆ తర్వాత డైలాగ్ చెప్పాను. 'టేక్ ఓకే' అని అన్నాడు. ఇక అప్పటినుండి జనాలుగా గుంపులుగా ఉన్నప్పుడు సైలెంట్ గానే డైలాగ్స్ చెప్తుంటాను.
" విశ్వనాథ్ గారితో సినిమా ఏంటి ఆ సినిమా? ఏం జరిగింది" అని బాలకృష్ణ అడిగారు. "అది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా. ఆరు నెలలు కష్టపడి సీన్స్ కొన్ని చేశాం. కానీ అవి అంతగా సెట్ కాలేదు. మళ్ళీ దిల్ రాజు పిలిచి 'పర్వాలేదు..మళ్ళీ తీద్దాం. మంచి సినిమానే చేద్దాం' అని చెప్పి ఫ్రీడం ఇచ్చాడు. విశ్వనాథ్ గారితో చేసిన ఒక సీన్ లో జనాలు ఎక్కువగా ఉండటం వల్ల నేను సైలెంట్ గా డైలాగ్స్ చెప్పాను. అప్పుడు విశ్వనాథ్ గారు చూసి పిలిచి 'ఇలా అయితే ఎలా.. ఓపెన్ గా చెప్పాలి డైలాగ్స్. అలా సిగ్గుపడితే ఎలా.. రాజమళి ఇదే నేర్పించాడా' అని అన్నారు. ఆ తర్వాత నేను " సర్.. సర్" అనే సరికి కూల్ అయ్యారు. "ఆ తర్వాత చేసిన సినిమాల డైరెక్టర్లు అందరు.. 'రాజమౌళి వల్లే.. డైలాగ్స్ అన్నీ ఇలా సైలెంట్ గా చెప్తున్నావ్ నువ్వు అని తిడుతుంటారు" అని ఫ్రభాస్ చెప్పాడు.
![]() |
![]() |